రాష్ట్రస్థాయి పోటీల్లో చాంపియన్‌గా నిలవాలి | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీల్లో చాంపియన్‌గా నిలవాలి

Nov 3 2025 7:12 AM | Updated on Nov 3 2025 7:12 AM

రాష్ట్రస్థాయి పోటీల్లో చాంపియన్‌గా నిలవాలి

రాష్ట్రస్థాయి పోటీల్లో చాంపియన్‌గా నిలవాలి

మహబూబ్‌నగర్‌ క్రీడలు: రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్టు మెరుగైన ప్రతిభ కనబరిచి చాంపియన్‌గా నిలవాలని జిల్లా సాఫ్ట్‌బాల్‌ అ సోసియేషన్‌ అధ్యక్షుడు అమరేందర్‌రాజు అన్నారు. జిల్లాకేంద్రంలోని మెయిన్‌ స్టేడియంలో ఆదివారం ఉమ్మడి జిల్లా మహిళా సాఫ్ట్‌బాల్‌ జట్టును ఎంపిక చేశారు. ఈ సందర్భంగా అమరేందర్‌రాజు మాట్లాడుతూ జిల్లా సాఫ్ట్‌బాల్‌ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లా సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ సభ్యులు మాట్లాడుతూ జగిత్యాలలో ఈ నెల 7 నుంచి 9 వరకు రాష్ట్రస్థాయి సీనియర్‌ సాఫ్ట్‌బాల్‌ మహిళల టోర్నమెంట్‌ ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్‌ సంఘం కార్యదర్శి జి.శరత్‌చంద్ర, జిల్లా సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ సభ్యులు రాఘవేందర్‌, నాగరాజు, సుగుణ తదితరులు పాల్గొన్నారు.

– ఉమ్మడి జిల్లా మహిళా జట్టుకు ఎస్‌.సునీత, పి.మంజుల, భార్గవి, శిరీషా, తులసి, పి.కాంచన, కీర్తి, కె.నిఖిత, పి.నిఖిత, ఎం.వర్షిత, కె.పల్లవి, శివజ్యోతి (మహబూబ్‌నగర్‌), పి.రోషిని, జి.మనీషా, జె.మహేశ్వరి, శిరీషా రాణి (నారాయణపేట), స్టాండ్‌బైగా శ్వేత, ఎం.వర్షిత (మహబూబ్‌నగర్‌) ఎంపికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement