కృత్రిమ పాదాల ఉచిత శిబిరం అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

కృత్రిమ పాదాల ఉచిత శిబిరం అభినందనీయం

Nov 3 2025 7:04 AM | Updated on Nov 3 2025 7:04 AM

కృత్రిమ పాదాల ఉచిత శిబిరం అభినందనీయం

కృత్రిమ పాదాల ఉచిత శిబిరం అభినందనీయం

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: దివ్యాంగులకు ఉచిత కృత్రిమ పాదాల పంపిణీ కోసం శిబిరం నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలోని ఇండోర్‌ హాల్‌లో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో డాక్టర్‌ విజయపాల్‌రెడ్డి, గుడిగోపురం మట్టారెడ్డి కుటుంబాల ఆర్థిక సహాయంతో ఆదివారం దివ్యాంగులకు ఉచిత కృత్రిమ పాదాల పంపిణీ చేయడానికి నిర్వహించిన ఎంపిక శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో సేవ భావన పెరిగితేనే నిజమైన అభివృద్ధి సాధ్యం అన్నారు. దాదాపు 150 మంది దివ్యాంగులకు కృత్రిమ పాదాలు పంపిణీ చేయడానికి నిర్వాహకులు కొలతలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందిస్తున్న కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నర్సింహారెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి జరీనాబేగం, నాయకులు సుధాకర్‌రెడ్డి, ప్రశాంత్‌, సంపత్‌, ప్రమోద్‌కుమార్‌, సాంబశివరావు, రంగారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement