మహిళ మెడలో మంగళసూత్రం చోరీ | - | Sakshi
Sakshi News home page

మహిళ మెడలో మంగళసూత్రం చోరీ

Sep 5 2025 7:35 AM | Updated on Sep 5 2025 7:35 AM

మహిళ

మహిళ మెడలో మంగళసూత్రం చోరీ

జడ్చర్ల టౌన్‌: మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట ఫ్రీజన్‌ రోడ్డులో గురువారం గోదా నాగలక్ష్మి అనే మహిళ మెడలో గుర్తు తెలియని దుండగులు పుస్తెలతాడు (బంగారుగొలుసు) చోరీ చేశారు. స్థానికంగా నివాసముంటున్న నాగలక్ష్మి రేషన్‌ దుకాణానికి వెళ్లి ఇంటికి తిరిగి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమెను ఫాలో అవుతూ వచ్చాడు. నిర్మానుష ప్రాంతంలో మెడలోని గొలుసు చోరీ చేసినట్లు బాధితురాలు తెలిపారు. అనంతరం ఎన్‌ఎస్‌125 బైక్‌పై సిద్ధంగా ఉన్న మరో దుండగుడితో కలసి పరారైనట్లు పేర్కొన్నారు. బాధితురాలు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ మల్లేష్‌ సంఘటనా స్థలానికి చేరుకొని సమీపంలోని సీసీ కెమెరాల రికార్డులు పరిశీలించారు. చోరీ అయిన గొలుసు మూడు తులాలు ఉంటుందుని బాధితురాలు వాపోయింది.

బైక్‌పై పరారైన దొంగలు

మహిళ మెడలో మంగళసూత్రం చోరీ 1
1/1

మహిళ మెడలో మంగళసూత్రం చోరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement