ఇసుక టిప్పర్‌ ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

ఇసుక టిప్పర్‌ ఢీకొని వ్యక్తి మృతి

May 31 2025 12:20 AM | Updated on May 31 2025 12:20 AM

ఇసుక టిప్పర్‌ ఢీకొని వ్యక్తి మృతి

ఇసుక టిప్పర్‌ ఢీకొని వ్యక్తి మృతి

మక్తల్‌: ఇసుక టిప్పర్‌ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన గొల్లపల్లిలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మక్తల్‌ మండలం మంతెని్‌ గోడ్‌ గ్రామానికి చెందిన గోసాయి అంజప్ప (45) ఇతర గ్రామాలకు వెళ్లి మెకానిక్‌ పని చేసుకుంటూ జీవించేవాడు. గురువారం కూడా పని నిమిత్తం బైక్‌పై మక్తల్‌ గ్రామానికి వెళ్తుండగా మక్తల్‌ నుంచి మహబూబ్‌గనర్‌కు ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంజప్ప అక్కడికక్కడే మరణించాడు. అంజప్పకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఆచారి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement