బీచుపల్లి అంజన్న సన్నిధిలో దాసంగాలు | - | Sakshi
Sakshi News home page

బీచుపల్లి అంజన్న సన్నిధిలో దాసంగాలు

Jun 1 2025 12:44 AM | Updated on Jun 1 2025 12:44 AM

బీచుపల్లి అంజన్న సన్నిధిలో దాసంగాలు

బీచుపల్లి అంజన్న సన్నిధిలో దాసంగాలు

ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని అభయాంజనేయస్వామి సన్నిధిలో శనివారం భక్తులు స్వామివారికి ప్రత్యేక దాసంగాలు సమర్పించారు. నెల రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా మూడో వారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంలో పుణ్యక్షేత్రం ఆంజనేయస్వామి నామస్మరణతో మార్మోగింది. ఆలయ ప్రధాన అర్చకుడు స్వామివారికి పంచామృత అభిషేకం, ఆకుపూజ, మహా మంగళహారతి వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు బీచుపల్లికి చేరుకొని పవిత్ర కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో ఆంజనేయస్వామిని దర్శించుకొని, దాసంగాలు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement