
దేశం తరఫున ఆడటం జిల్లాకే గర్వకారణం
మహబూబ్నగర్ క్రీడలు: అనన్యశ్రీ అంతర్జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుండడం ఉమ్మడి జిల్లాకే గర్వ కారణమని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్పీ వెంకటేశ్ అన్నారు. మక్తల్కు చెందిన అనన్యశ్రీ వియాత్నంలో ఈనెల 7 నుంచి 14 వరకు జరిగే ఆసియా వాలీబాల్ పోటీలకు ఎంపికకావడంపై ఆమె తల్లిదండ్రులు పి.ఆనంద్, వరలక్ష్మిలను మంగళవారం జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో సన్మానం చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ వాలీబాల్లో అనన్యశ్రీని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను అభినందించారు. ఆమె గతంలో చైనాలో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ పోటీల్లో ఆడడం సంతోషంగా ఉందన్నారు. మరింత మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్, జిల్లా వాలీబాల్ సంఘం ప్రతినిధులు చెన్న వీరయ్య, గులాం దస్తగిర్ఖాన్, జిల్లా కబడ్డీ సంఘం ఉపాధ్యక్షులు దామోదర్రెడ్డి, జిల్లా యోగా సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్.బాల్రాజు తదితరులు పాల్గొన్నారు.