
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
పాలమూరు: పర్యావరణం పరిరక్షించడంతో పాటు పరిసరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా కోర్టు ఆవరణలో న్యాయమూర్తులు మొక్కలు నాటారు. అనంతరం కోర్టు సముదాయం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు పర్యావరణంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని, అదేవిధంగా ఆ మొక్కను బాధ్యతగా సంరక్షించాలన్నారు. ప్లాస్టిక్ వస్తువులను, వ్యర్థాలను పూర్తిగా తగ్గించడానికి ప్రయత్నించాలని కోరారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు కల్యాణ్ చక్రవర్తి, ఇందిర, శారదాదేవి, రాజేశ్వరి, రాధిక, ఈశ్వరయ్య, మునవర్ హుస్సేన్, రవిశంకర్, న్యాయవాదులు పాల్గొన్నారు.