
బాస్కెట్బాల్ చాంపియన్ హైదరాబాద్
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న అండర్–23 విభాగం 3గీ3 పురుషుల, మహిళల బాస్కెట్బాల్ చాలెంజర్ టోర్నీ గురువారం ముగిసింది. టోర్నీలో పలు జట్లు నువ్వా.. నేనా అనే రీతిలో తలపడ్డాయి. ఫైనల్లో హైదరాబాద్ పురుషుల, మహిళల జట్లు మెరుగైన ప్రదర్శన కనబరిచి చాంపియన్లుగా నిలిచాయి. ఉత్కంఠ పోరులో హైదరాబాద్ పురుషుల జట్టు 14–12 పాయింట్ల తేడాతో రంగారెడ్డి జట్టుపై విజయం సాధించింది. అదే విధంగా మహిళల విభాగం ఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు 21–4 పాయింట్ల తేడాతో మహబూబ్నగర్ జట్టుపై విజయం సాధించింది. పురుషుల విభాగం మూడో స్థానంలో హన్మకొండ, మహిళల మూడో స్థానంలో రంగారెడ్డి జట్లు నిలిచాయి. టోర్నీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులుగా గౌతమ్ (హైదరాబాద్), జాహ్నావి (హైదరాబాద్), ఉత్తమ షూటర్లుగా శ్రీకాంత్ (రంగారెడ్డి), భువనేశ్వరి (మహబూబ్నగర్) నిలిచారు.
● శాట్ చైర్మన్ శివసేనారెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో క్రీడాభివృద్ధి కోసం రూ. 110కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో రెండేళ్లలో క్రీడల కోసం రూ. 850కోట్లు కేటాయించినట్లు చెప్పారు. మహబూబ్నగర్లో రూ. 2.50కోట్లతో జిమ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇండోర్ స్టేడియంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఉమ్మడి జిల్లాకు స్పోర్ట్స్ స్కూల్ తీసుకొచ్చినట్లు తెలిపారు. దేశంలోనే తెలంగాణను క్రీడల హబ్గా తీర్చిదిద్దుతామని అన్నారు. టీబీఏ రాష్ట్ర అధ్యక్షుడు రావుల శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ.. టోర్నీలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జాతీయస్థాయికి ఎంపికవుతారని అన్నారు. జాతీయస్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం నంబర్వన్గా ఉండాలని ఆకాంక్షించారు. కాగా, రాష్ట్రస్థాయి అండర్–23 విభాగం 3గీ3 బాస్కెట్బాల్ టోర్నీలో 18 జిల్లాల నుంచి 180 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మక్సూద్ బిన్ అహ్మద్ జాకీర్ తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్రట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీశ్వర్రెడ్డి, జిల్లా కార్యదర్శి నసరుల్లా హైదర్, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎన్పీ.వెంకటేశ్, కురుమూర్తిగౌడ్, మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీధర్రావు, రిటైర్డ్ పీడీ చెన్న వీరయ్య, సజ్జాద్అలీ, సుబాన్జీ, మీర్ ఖాలెద్అలీ, గీత, ఎండీ ఇలియాజ్, ఫారుఖ్ ముకర్రం, బాల్రాజు, గోపాలకృష్ణ, ఎండీ షకీల్, సోహెల్, జియావుద్దీన్ పాల్గొన్నారు.
ట్రోఫీలు ప్రదానం
టోర్నీ విన్నర్, రన్నరప్ జట్లకు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి ట్రోఫీలు, మెడల్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలని క్రీడాకారులకు సూచించారు. రన్నర్గా నిలిచిన జట్లు మళ్లీ గెలవడానికి ప్రయత్నం చేయాలన్నారు.
పురుషుల, మహిళా విభాగాల్లో హవా
మహిళల రన్నరప్గా నిలిచిన మహబూబ్నగర్ జట్టు
ముగిసిన అండర్–23 (3గీ3) బాస్కెట్బాల్ టోర్నీ

బాస్కెట్బాల్ చాంపియన్ హైదరాబాద్

బాస్కెట్బాల్ చాంపియన్ హైదరాబాద్