సీనియర్‌ సిటిజన్స్‌ ఫోరం కొత్త కార్యవర్గం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

సీనియర్‌ సిటిజన్స్‌ ఫోరం కొత్త కార్యవర్గం ఎన్నిక

Jun 6 2025 12:23 AM | Updated on Jun 6 2025 12:23 AM

సీనియర్‌ సిటిజన్స్‌ ఫోరం కొత్త కార్యవర్గం ఎన్నిక

సీనియర్‌ సిటిజన్స్‌ ఫోరం కొత్త కార్యవర్గం ఎన్నిక

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: స్థానిక మెట్టుగడ్డలోని సర్వశిక్షా అభియాన్‌ ఆర్‌వీఎం సమావేశ మందిరంలో గురువారం సీనియర్‌ సిటిజన్స్‌ ఫోరం కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జగపతిరావు, ప్రధాన కార్యదర్శిగా నస్కంటి నాగభూషణం, కోశాధికారిగా కేవీ అశోక్‌, ఈసీ సభ్యుడిగా జి.నాగభూషణం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఫోరంలో మొత్తం 163 మంది సభ్యులు ఓటు హక్కు కలిగి ఉండగా.. 101 ఓట్లు పోలయ్యాయి. ఇందులో ఉపాధ్యక్ష పదవికి ముగ్గురు పోటీలో నిలవగా.. ఎ.రాజసింహుడు 81 ఓట్లతో, అలాగే సంయుక్త కార్యదర్శి పదవికి ముగ్గురు పోటీలో ఉండగా.. ఎల్‌.గంగాధర్‌ 45 ఓట్లతో, మరో ఈసీ పదవికి ఇద్దరు రంగంలో నిలవగా.. చివరకు రాములు 57 ఓట్లతో గెలుపొందారు. పోలింగ్‌ అధికారులుగా సాయిలుగౌడ్‌, అంజయ్యచారి, బాలకిషన్‌, బురానుద్దీన్‌, కృష్ణయ్య వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement