
లీగ్ కం నాకౌట్ మ్యాచ్లు...
టోర్నీలో లీగ్కం నాకౌట్ పద్ధతిలో మ్యాచ్లను నిర్వహించనున్నారు. దాదాపు 75 లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. ఔట్ డోర్, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో పగలు, సాయంత్రం ఫ్లడ్లైట్ల వెలుతురులో మ్యాచ్లు జరగనున్నాయి. బుధవారం ఉదయం 12 గంటలకు స్టేడియంలో రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ టోర్నీ ప్రారంభం కానునుంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, రాష్ట్ర క్రీడావ్యవహారాల సలహాదారులు ఏపీ జితేందర్రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. మంగళవారం ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లను జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మక్సూద్ బిన్ అహ్మద్ జాకీర్, నసరుల్లా హైదర్ పరిశీలించారు. కార్యక్రమంలో మీర్ ఖాలెద్అలీ, సుబాన్జీ, మహ్మద్ ఇలియాజ్, గోపాలకృష్ణ, ఫారుఖ్ ముకర్రం, షకీల్, వినోద్కుమార్, బాల్రాజు తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్ జట్టు: అలీ అబ్దుల్ బాసిత్, జి.రోహిత్, టి.వివేక్, ఎస్.ఆదిత్య నారాయణ్, భువనేశ్వరి, పి.అర్చిత, ప్రియాంక, స్టాండ్బై భాను, తనుశ్రీ.