మిషన్ భగీరథ తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామాల్లో తాగు నీటి కోసం జనం నానా తంటాలు పడ్డారు. మండల పరిధిలోని కొత్తపాలెం తండాలో 5 రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో తండా వాసులు 2 కి.మీ దూరంలో ఉన్న వ్యవసాయ బోరు వద్దకు కాలి నడకన వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తండాలో ప్రతి 15 రోజులకు ఒక సారి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని మహిళలు పేర్కొంటున్నారు. మిషన్ భగీరథ తాగునీటి సరఫరా
సక్రమంగా నిర్వహించి తమ సమస్యను పరిష్కరించాలని మహిళలు కోరుతున్నారు. ఇదిలా ఉండగా..
మండల పరిధిలోని జూరాల వద్ద ఉన్న మిషన్ భగీరథ హెడ్ వర్క్స్లో సంపుల క్లీనింగ్లో భాగంగా మంగళవారం జిల్లాలోని అన్ని మండాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ధరూరులో కూడా నీటికష్టాలు మొదలవడంతో జనం ఏకంగా మిషన్ భగీరథ ట్యాంకు ఎక్కి నీటిని తెచ్చుకునే ప్రయత్నం చేశారు. అందులోనూ నీళ్లు లేకపోవడంతో కిందికి దిగిపోయారు. ప్రాణాలకు తెగించి మరీ ఇలా ట్యాంకులు ఎక్కిన మహిళల ఫోటోలు సామాజిక మాద్యమాల్లో వైరల్ అయ్యాయి. – ధరూరు
బిందె నీటి కోసం 2 కి.మీ. నడవాల్సిందే