
నేటినుంచి బాస్కెట్బాల్ టోర్నీ
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రం రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు వేదికకానుంది. మెయిన్ స్టేడియంలో నేడు (బుధవారం), గురువారం మొదటి రాష్ట్రస్థాయి అండర్–23 విభాగం (3 ్ఠ3) పురుషుల, మహిళా అంతర్ జిల్లాల చాలెంజర్ బాస్కెట్బాల్ చాంపియన్షిప్ జరగనుంది. ఈ పోటీలకు రాష్ట్రంలోని 20 జిల్లాల పురుషుల, మహిళా జట్లు పాల్గొంటున్నాయి. ఆయా జిల్లాల నుంచి 180 మంది క్రీడాకారులు, 50 మంది అధికారులు హాజరవుతున్నారు. టోర్నీలో పాల్గొనే పురుషులకు లిటిల్ స్కాలర్స్ స్కూల్, మహిళలకు చైతన్య స్కూల్, ఇండోర్ స్టేడియంలో వసతి సౌకర్యం ఏర్పాటు చేశారు. ఇండోర్ స్టేడియంలో భోజన వసతి కల్పించనున్నారు.
విజయవంతంగా నిర్వహిస్తాం..
జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ టోర్నీ నిర్వహిస్తున్నాం. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. అందరి సహకారంతో రాష్ట్రస్థాయి టోర్నీని విజయవంతంగా నిర్వహిస్తాం. గత ఏడాది ఆగస్టు చివరివారంలో రాష్ట్రస్థాయి యూత్ బాస్కెట్బాల్ టోర్నీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాం.
– మక్సూద్బిన్ అహ్మద్ జాకీర్,
అధ్యక్షుడు, జిల్లా బాస్కెట్బాల్
అసోసియేషన్, మహబూబ్నగర్
ఔట్ డోర్, ఇండోర్ స్టేడియంలో మ్యాచ్లు
హాజరుకానున్న 20 జిల్లాల నుంచి 180 మంది క్రీడాకారులు

నేటినుంచి బాస్కెట్బాల్ టోర్నీ