
‘బీసీలకు 42 శాతం రిజర్వేష కల్పించాలి’
బిజినేపల్లి: జనాభా నిష్పత్తి ప్రకారం దేశం, రాష్ట్రంలో బీసీలకు దక్కాల్సిన నిధులు, రిజర్వేషన్లు అందడం లేదని బీసీ జన చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు డా.దాసరి అజయ్కుమార్ అన్నారు. శనివారం బిజినేపల్లి మండల కేంద్రంలో బీసీ సంఘాల నాయకులు ఒక రోజు రీలే నిరాహార దీక్ష చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు, రాష్ట్ర ప్రభుత్వం బీసీల కోసం ప్రత్యేకంగా సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సబ్ ప్లాన్ ద్వారా ప్రతి సంవత్సరం బీసీలకు రూ.20 వెల కోట్లు నిధులు కేటాయించి, కుల వృత్తుల వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలని కోరారు. రాజీవ్ యువ వికాసం పథకంలో బీసీలకు 56శాతం అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ను పెంచాలన్నారు. కార్యక్రమంలో పూలే ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు పచ్చిపాల సుబ్బయ్య, నాయకులు చింతకుంట శ్రీనివాస్యాదవ్, నారమోని నరేష్యాదవ్, వెంకటస్వామి, భాస్కర్, సత్యశీలాసాగర్, ఈర్ల చంద్రమోళి, శ్రీనివాస్గౌడు, సంజీవ్గౌడు తదితరులు పాల్గొన్నారు.