
లా, ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటుతో విద్యాభివృద్ధి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ ప్రభుత్వం లా, ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఉమ్మడి జిల్లాలో విద్యాభివృద్ధి జరుగుతుందని, వాటి ఏర్పాటుకు కృషి చేసిన వైస్ ఛాన్స్లర్ శ్రీనివాస్ను బీసీటీఏ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో మొదటి సారి లా, ఇంజినీరింగ్ కళాశాలలను ఏర్పాటు చేయడం వల్ల ఎంతో మంది పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుందని, ఉమ్మడి జిల్లాలో విద్యాభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. కొత్త కళాశాలలో విద్యార్థులు ఉపాధి కల్పించే విధంగా కోర్సులను ఏర్పాటు చేసే వారు త్వరిత గతిన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రాములు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేందర్, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.