భక్తిశ్రద్ధలతో రాములోరి కల్యాణం | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో రాములోరి కల్యాణం

May 31 2025 12:20 AM | Updated on May 31 2025 12:20 AM

భక్తిశ్రద్ధలతో రాములోరి కల్యాణం

భక్తిశ్రద్ధలతో రాములోరి కల్యాణం

ఎర్రవల్లి: శ్రీరాముడి జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు భానుమూర్తి, దత్తుస్వామి ఆధ్వర్యంలో సీతారాములను అలంకరించి వేదమంత్రాల నడుమ వైభవంగా కల్యాణం జరిపించారు. దీంతో ఆలయ చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరైన పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో సీతారాముల కల్యాణాన్ని తిలకించారు. భక్తులకు ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో అన్నదానం చేసినట్లు మేనేజర్‌ సురేందర్‌రాజు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement