
భూగర్భ జలవిద్యుత్ కేంద్రం సందర్శన
దోమలపెంట: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి శనివారం సందర్శించారు. ఆయనకు కేంద్రం చీఫ్ ఇంజినీర్ రామసుబ్బారెడ్డి స్వాగతం పలికి, విద్యుదుత్పత్తి తీరు, ఉత్పత్తి చేసిన విద్యుత్ను లోడ్ డిస్పాచ్కు సరఫరా చేసే విధానం గురించి వివరించారు. మెయిన్ కంట్రోల్ రూంలో ఇంజినీర్లు విధులు నిర్వహించే పద్ధతులపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం క్రిష్ణా బేసిన్లో వరద కొనసాగుతున్నందున ఈ ఏడాది కూడా భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ కేంద్రం నిర్వహణ తీరు బాగుందని, అధికారులు అహర్నిశలు కష్టపడుతున్నారని కొనియాడారు. కార్యక్రమంలో చైర్మన్తో పాటు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.