ఇంట్రా డిస్ట్రిక్ట్‌ చాంపియన్‌గా మహబూబ్‌నగర్‌ | - | Sakshi
Sakshi News home page

ఇంట్రా డిస్ట్రిక్ట్‌ చాంపియన్‌గా మహబూబ్‌నగర్‌

May 31 2025 12:20 AM | Updated on May 31 2025 12:20 AM

ఇంట్రా డిస్ట్రిక్ట్‌ చాంపియన్‌గా మహబూబ్‌నగర్‌

ఇంట్రా డిస్ట్రిక్ట్‌ చాంపియన్‌గా మహబూబ్‌నగర్‌

మహబూబ్‌నగర్‌ క్రీడలు: అండర్‌–23 ఇంట్రా డిస్ట్రిక్ట్‌ టూడే లీగ్‌లో మహబూబ్‌నగర్‌ జట్టు చాంపియన్‌గా నిలిచింది. లీగ్‌లో మొదటి నుంచి మెరుగైన ప్రదర్శన కనబరిచిన మహబూబ్‌నగర్‌ జట్టు వర్షం వల్ల ఒక మ్యాచ్‌ రద్దు కాగా మిగిలిన 4 మ్యాచుల్లో విజయాలు సాధించి 22 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకుంది. లీగ్‌లో మహబూబ్‌నగర్‌ జట్టు బౌలర్‌ ఎండీ ముఖితుద్దీన్‌ అత్యధికంగా 35 వికెట్లు తీశాడు.

– జిల్లా కేంద్రానికి సమీపంలోని సమర్థ స్కూల్‌ మైదానంలో శుక్రవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్‌ ఇన్నింగ్స్‌ 52 పరుగుల తేడాతో నారాయణపేటపై గెలుపొందింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన మహబూబ్‌నగర్‌ 49.5 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌట్‌ అయింది. జట్టులో అక్షయ్‌ 103 బంతుల్లో 3 సిక్స్‌లు, 4 ఫోర్లతో 63 పరుగులు చేశాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌ చేపట్టిన నారాయణపేట జట్టు 24.2 ఓవర్లలో కేవలం 72 పరుగులకు ఆలౌట్‌ అయింది. మహబూబ్‌నగర్‌ బౌలర్లు ముఖితుద్దీన్‌ 18 పరుగులు ఇచ్చి 4, షాదాబ్‌ అహ్మద్‌ 11 పరుగులకు 3, శశాంక్‌ 14 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశారు. అనంతరం ఫాలోఆన్‌ ఆడిన నారాయణపేట రెండో ఇన్నింగ్స్‌లో 17.5 ఓవర్లలో 84 పరుగులకు ఆలౌట్‌ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో ముఖితుద్దీన్‌ అ 6.5 ఓవర్లలో 48 పరుగులు ఇచ్చి 6 వికెటు ్ల తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

లీగ్‌లో నాలుగు విజయాలతో అగ్రస్థానం

చివరి మ్యాచ్‌లో నారాయణపేటపై ఇన్నింగ్స్‌ గెలుపు

రానున్న హెచ్‌సీఏ టోర్నీల్లో ప్రతిభచాటాలి

రానున్న హెచ్‌సీఏ టోర్నీల్లో క్రీడాకారులు ప్రతిభచాటాలని ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్‌ అన్నారు. అండర్‌–23 ఇంట్రా డిస్ట్రిక్ట్‌ టూడే లీగ్‌ చాంపియన్‌గా నిలిచిన మహబూబ్‌నగర్‌ జట్టును ఆయన అభినందించారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని క్రీడాకారులను ప్రోత్సహించడానికి మొదటిసారిగా ఆరు జట్లతో అండర్‌–23 ఇంట్రా డిస్ట్రిక్ట్‌ లీగ్‌ నిర్వహించినట్లు తెలిపారు. ఈ లీగ్‌లో రాణించిన క్రీడాకారులను 24 మందితో రెండు జట్లుగా విభజించి మూడు మ్యాచ్‌లు నిర్వహించి ప్రతిభచాటే 15 మంది తుది జట్టును ఎంపిక చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నారాయణపేట జిల్లాకు చెందిన డీఎంహెచ్‌ఓ జయచంద్ర మోహన్‌, డీపీఓ బిక్షపతి, కోచ్‌ రమణ, శ్రీనివాస్‌గౌడ్‌, ఉమేష్‌కుమార్‌, సీనియర్‌ క్రీడాకారులు ముఖ్తార్‌, రంజిత్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement