
‘షైన్’ విద్యార్థుల విజయదుందుభి
హన్మకొండ : నీట్–2025 ఫలితాల్లో ‘షైన్’ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి విజయదుందుభి మోగించారు. తమ కళాశాల విద్యార్థులు కార్పొరేట్కు దీటుగా నీట్లో అత్యుత్తమ ఫలితాలు సాధించారని ‘షైన్’ విద్యా సంస్థల చైర్మన్ మూగల కుమార్ తెలిపారు. షైన్ విద్యాసంస్థలు మొదటి నుంచి, నీట్, జేఈఈ, మెయిన్స్, అడ్వాన్స్లో అత్యుత్తమ శిక్షణ ఇస్తున్నాయన్నారు. నీట్లో జాతీయ స్థాయిలో జి. కీర్తన –498 మార్కులు , కె. సహస్ర– 497, డి. ఇందూ– 437, ఇ. వెంకట శివాణి–427 మార్కులు సాధించారని వివరించా రు. వీరితో పాటు 15 మంది విద్యార్థులు 300 పైగా మార్కులు సాధించారని తెలిపారు. ఉత్తమ ఫలి తాలు సాధించిన విధ్యార్థులను షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్, డైరెక్టర్లు మూగల రమ, మూగల రమేశ్, అధ్యాపకులు అభినందించారు.

‘షైన్’ విద్యార్థుల విజయదుందుభి

‘షైన్’ విద్యార్థుల విజయదుందుభి