నిబంధనలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు పాటించాలి

Jun 14 2025 10:30 AM | Updated on Jun 14 2025 10:30 AM

నిబంధనలు పాటించాలి

నిబంధనలు పాటించాలి

డోర్నకల్‌: విత్తన విక్రయ దుకాణదారులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని డీఏఓ విజయనిర్మల సూచించారు. డోర్నకల్‌, గొల్లచర్ల, చిలుకోడు గ్రామాల్లోని ఫెస్టిసైడ్స్‌ దుకాణాలతో పాటు సొసైటీ కార్యాలయాల్లో శుక్రవారం డీఏఓ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎరువులతో పాటు విత్తనాల నిల్వ లను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. దుకాణదారుల పీఓఎస్‌ మిషన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. దుకాణదారులు స్టాక్‌ వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మురళీమోహన్‌, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు.

డీఏఓ విజయనిర్మల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement