
కాజీపేట జంక్షన్ మీదుగా ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కాజీపేట జంక్షన్ మీదుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు చర్లపల్లి–తిరుపతి మధ్య 10 ప్రత్యేక రైళ్ల సర్వీస్లను ప్రవేశపెట్టి నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ శుక్రవారం తెలిపారు.
ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా..
జూలై 2వ తేదీ నుంచి 30వ తేదీ వరకు చర్లపల్లి–తిరుపతి (07251) ఎక్స్ప్రెస్ ప్రతి బుధవారం కాజీపేట జంక్షన్కు చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో జూలై 3వ తేదీ నుంచి 31వ తేదీ వరకు తిరుపతి–చర్లపల్లి (07252) ఎక్స్ప్రెస్ ప్రతి శుక్రవారం కాజీపేట జంక్షన్కు చేరుకుటుంది. 1 ఏసీ, 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లతో ప్రయాణించే ఈ రైళ్ల సర్వీస్లకు అప్ అండ్ డౌన్ రూట్లో జనగామ, కాజీపేట, వరంగల్, నెక్కొండ, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీ కాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.