ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి

Jun 14 2025 9:58 AM | Updated on Jun 14 2025 9:58 AM

ఎన్ని

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి

కార్యకర్తలకు పంచాయతీరాజ్‌ శాఖ

మంత్రి సీతక్క పిలుపు

కొత్తగూడ: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చి నా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరా జ్‌, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సూ చించారు. మహబూబా బాద్‌ జిల్లా కొత్తగూడ మండలకేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం నిర్వహించిన కొత్తగూడ, గంగారం మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఐఏఎస్‌ అధికారుల బదిలీల వల్ల కొంత జాప్యం జరుగుతుందని, వారం పది రోజుల్లో ఎన్నికలపై స్పష్టత వస్తుందని అన్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని సూచించారు. రైతు భరోసా కొంత ఆలస్యమవుతున్న విషయం నిజమేనని, అది కూడా త్వరలో ప్రభుత్వం వేస్తుందన్నారు. ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఇతర సంక్షేమ పథకాలతో ప్రజలను చైతన్యం చేయాలన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని దిశా నిర్దేశం చేశారు. అదేవిధంగా మండలకేంద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో పిల్లలకు మంత్రి సీతక్క.. సామూహిక విద్యాభ్యాసం చేయించారు. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలు అందజేశారు.

ప్రైవేట్‌లో అధిక ఫీజులను నియంత్రించాలి

విద్యారణ్యపురి: ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల భారాన్ని నియంత్రించాలని విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో 25 శాతం పేదవర్గాల పిల్లలకు అడ్మిషన్లు కల్పించేలా చర్యలు చేపట్టాలని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్‌ డిమాండ్‌ చేశారు. హనుమకొండ డీఈఓ వాసంతి, వరంగల్‌ డీఈఓ జ్ఞానేశ్వర్‌కు శుక్రవారం వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా దాసు సురేష్‌ మాట్లాడుతూ ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు అడ్డూ.. అదుపు లేకుండా ఫీజులు వసూలు చేస్తున్నాయని అన్నారు. పేదపిల్లలకు ప్రైవేట్‌లో ఉచితంగా విద్యను అందించాలని రాజ్యాంగంలోనే ఉందన్నారు. ప్రతి తరగతిలో 25 శాతం సీట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ వంగ రవియాదవ్‌, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఏరుగొండ హైమవతి, సిలువేరు రవీందర్‌, అశోక్‌, కొడపాక దేవి, శ్రీరామోజు అంజలి, యోగేశ్వర్‌ పాల్గొన్నారు.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి1
1/1

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement