అమ్మ మాట.. అంగన్‌వాడీ బాట | - | Sakshi
Sakshi News home page

అమ్మ మాట.. అంగన్‌వాడీ బాట

Jun 12 2025 3:09 AM | Updated on Jun 12 2025 3:09 AM

అమ్మ మాట.. అంగన్‌వాడీ బాట

అమ్మ మాట.. అంగన్‌వాడీ బాట

మహబూబాబాద్‌: అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం ‘అమ్మ మాట..అంగన్‌వాడీ బాట’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రెండున్నర సంవత్సరాల వయస్సు గల పిల్లలను గుర్తించడం, అంగన్‌వాడీ వ్యవస్థ ద్వారా నిర్వహించే కార్యక్రమాలను తెలియడంతో పాటు ప్రీ స్కూల్‌ విధానం ప్రాధాన్యతను వివరిస్తారు.

ఈనెల11 నుంచి 17వరకు కార్యక్రమాలు..

ఈనెల 11 నుంచి 17వరకు ప్రభుత్వం అమ్మ మాట ..అంగన్‌వాడీ బాట కార్యక్రమం నిర్వహించాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ సర్క్యులర్‌ జారీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగానే ఈనెల 10న అంగన్‌వాడీ కేంద్రాలను అందంగా అలంకరించాలని ఆదేశించారు.

● 11న తల్లితండ్రులకు, పిల్లలకు స్వాగతం పలికి సెల్ఫీలు తీసుకోవాలి. గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించాలి. ఇళ్ల సందర్శన, పిల్లలను కేంద్రాల్లో చేర్పించడం, ప్రీస్కూల్‌ పూర్తి చేసిన పిల్ల లకు సర్టిఫికెట్‌ ఇవ్వాలి. 5 సంవత్సరాలు పైబడిన వారిని ప్రాథమిక పాఠశాలలో చేర్పించాలి.

● 12,13, 16 తేదీల్లో కిచెన్‌ గార్డెన్‌లు అభివృద్ధి చేయాలి. కూరగాయల మొక్కలు నాటాలి. టీహెచ్‌ఆర్‌, హెచ్‌సీఎం, పిల్లలకు అందించే పోషకాహారం గురించి గ్రామస్తులకు చెప్పాలి. కేంద్రాల్లో బొమ్మలు, పుస్తకాలు, ప్రీస్కూల్‌ కిట్‌లోని వస్తువులను ఎగ్జిబిషన్‌లా ప్రదర్శించాలి.

● 17న సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం ని ర్వహించాలి. పిల్లల అభివృద్ధి కార్డులు ప్రదర్శించాలి. ఇంటింటికీ అంగన్‌వాడీ కౌన్సెలింగ్‌ పుస్తకాన్ని ఉపయోగించి అవగాహన కల్పించాలి.

ఇందిరానగర్‌ సెంటర్‌ సందర్శన...

అమ్మమాట.. అంగన్‌వాడీ బాట కార్యక్రమంలో భా గంగా జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్‌ అంగన్‌వాడీ కేంద్రాన్ని బుధవారం కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌ సింగ్‌ సందర్శించారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పుస్తకాలను పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీ అంగన్‌వాడీ సెంటర్‌లో సీడీపీఓ శిరీష ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్‌ గుండు సులోచన పాల్గొన్నారు.

పిల్లల పేర్లు నమోదు చేసుకుంటాం..

అమ్మమాట..అంగన్‌వాడీ బాట కార్యక్రమం ద్వారా పిల్లల పేర్లు నమోదు చేసుకుంటాం. ప్రధానంగా ప్రీస్కూల్‌ విధానం ప్రాధాన్యత తెలియజేస్తాం. టీచర్లు ఇంటింటికీ తిరిగి రెండున్నర సంవత్సరాల వయస్సు గల పిల్లల ను గుర్తిస్తారు. 5 సంవత్సరాలు దాటిన పిల్ల లను ప్రైమరీ స్కూల్‌లో నమోదు చేస్తారు. ప్రైవేట్‌ పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివేలా తల్లిదండ్రులకు ప్ర భుత్వ కార్యకలాపాలను వివరిస్తారు.

– ధనమ్మ, డీడబ్ల్యూఓ

ఈనెల 17వ వరకు కార్యక్రమం

అంగన్‌వాడీ వ్యవస్థ బలోపేతమే లక్ష్యం

ఏర్పాట్లలో నిమగ్నమైన అఽధికారులు

అంగన్‌వాడీల వివరాలు

ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు : 5

సెక్టార్లు : 58

అంగన్‌వాడీ సెంటర్లు : 1,435

జీరో నుంచి ఆరు నెలలలోపు పిల్లలు : 3,604

ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలు : 20,295

మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు : 16,181

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement