
జర్నలిస్టు ‘కొమ్మినేని’ అరెస్టు అప్రజాస్వామికం
నెహ్రూసెంటర్: సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ ప్రభుత్వం అరెస్టు చేయడం అప్రజాస్వామికమని, సాక్షి మీడియా కార్యాల యాలపై దాడులు సరికాదని జర్నలిస్టు సంఘాల నాయకులు అన్నారు. ఆయన అరెస్టును నిరసిస్తూ జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం మానుకోట పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్లో ప్లకార్డులు పట్టుకొని, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ధర్నా నిర్వహించారు. టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు చిత్తనూరి శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే–143 జిల్లా కన్వీనర్ మద్దినేని గుట్టయ్య, తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షుడు చిర్రగోని ఉదయ్ధీర్ మాట్లాడుతూ.. జర్నలిస్టులపై కక్షసాధింపు వైఖరి సరికాదన్నారు. ఏపీ ప్రభుత్వం సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పని చేస్తున్న జర్నలిస్టుపై అక్రమ కేసులు పెట్టడం పత్రి కాస్వేచ్ఛకు గొడ్డలిపెట్టని పేర్కొన్నారు. శ్రీనివాసరావు అక్రమ అరెస్టును ప్రజాస్వామిక వాదులు ఖండించాలన్నారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జర్నలిస్టులు ఎంఏ ఫయీజ్, చందా శ్రీనివాస్, ఆకుల రమేశ్, పద్మం మహేశ్, బండారి జ్ఞానేందర్, వీరంటి ముఖేశ్, నూకల యశ్వంత్, గుండోజు సుబ్రహ్మణ్యం, గుండోజు దేవేందర్, కరుణాకర్, ఎర్రోజు అశోక్, దొంతు పురుషోత్తం, మాదాసు మహేశ్, గౌస్ పాషా, పసుపులేటి వెంకటేశ్వర్లు, రామరాజు ప్రవీణ్, ఆకుల నవీన్, తోకల రాంచంద్రు, శ్రీను, లావుడ్యా మనో హర్, కుమార్, బానోత్ శంకర్, గుంజె హన్మంతు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు సామ పాపయ్య, సాక్షి జర్నలిస్టులు ఈరగాని బిక్షం,అర్రం రమేశ్చందర్, బోనగిరి శ్రీనివాస్, గుజరాతి రాంప్రసాద్, చింతకుంట్ల యాకాంబ్రం, ఇరుకుళ్ల కిరణ్కుమార్, జిల్లె
ల్లమూడి మురళీమోహన్ పాల్గొన్నారు.
– మరిన్ని ఫొటోలు, వివరాలు 9లోu