
భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
డోర్నకల్: భూసమస్యల పరిష్కారానికే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. మండలంలోని గొల్లచర్ల గ్రామ రైతువేదికలో సోమవారం జరిగిన రెవెన్యూ సదస్సును కలెక్టర్ పరిశీలించారు. సదస్సులో రైతులు సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. భూసమస్యల పరిష్కారం కోసం సిబ్బంది కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీటీ వీరన్న, సిబ్బంది పాల్గొన్నారు. డోర్నకల్ మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో జరిగిన సదస్సులో తహసీల్దార్ ఇమ్మానియల్, సీనియర్ అసిస్టెంట్ నందా, ఆర్ఐ యాసీన్ తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ సదస్సు తనిఖీ..
గార్ల: మండలంలోని ముల్కనూరులో జరిగిన రెవె న్యూ సదస్సును కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ గ్రామాల్లో షెడ్యూల్ ప్రకారం ముందస్తుగా సమాచారం అందించి సదస్సుల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకొని భూ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. తహసీల్దార్శారద, డీటీ సంజీవ, ఆర్ఐలు శ్రీరామ్, రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
బయ్యారం: భూ సమస్యలు ఉన్న ప్రతీ రైతు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. సోమవారం మండలంలోని జగత్రావుపేట, కొత్తపేటలో జరిగిన రెవెన్యూ సదస్సులను కలెక్టర్ సందర్శించారు. జిల్లాలో ఈ నెల 20 వరకు కొనసాగే రెవెన్యూ సదస్సుల్లో రైతులు పాల్గొని తమ భూ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకోవా లని సూచించారు. తహసీల్దార్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్