
టీచర్ల సంక్షేమానికి అండగా ఉంటా
విద్యారణ్యపురి: విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, టీచర్ల సంక్షేమం కోసం తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండలోని పీఆర్టీయూ భవనం మొదటి అంతస్తును ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆభవన్లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. తనను ఎమ్మెల్యేగా గెలిపించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానన్నారు. పీఆర్టీయూటీఎస్ పాతినిథ్యం మేరకు పీఆర్టీయూ కాన్ఫరెన్స్ భవనం కోసం తప్పకుండా స్థలం కేటాయిస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సంక్షేమం కోసం, హక్కుల కోసం ఉద్యమించింది పీఆర్టీయూనే అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై శాసన మండలిలో గొంతుకనై పోరాడాతానన్నారు. ఈసమావేశంలో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం దామోదర్రెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మంద తిరుపతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఫలిత శ్రీహరి, వివిద జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఈదునూరి రవీందర్రెడ్డి, అబ్దుల్గఫార్, మిర్యాల సతీశ్రెడ్డి, కిరణ్కుమార్, తిరునగరి శ్రీనివాస్, పీఆర్టీయూ మాస పత్రిక ఉపసంపాదకుడు ఎడ్ల ఉపేందర్రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, బాధ్యులు దేవిరెడ్డిమాలకొండారెడ్డి, జాలి రాఘవరెడ్డి, ఉమామహేశ్వర్, నర్సింహారెడ్డి, అడప రామారావు, బాలిని రామయ్య వివిధ మండలాల బాధ్యులు పాల్గొన్నారు.
విద్యార్థులను తీర్చిదిద్దడంలో
టీచర్లే కీలకం
పీఆర్టీయూ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని