ఎరువుల దుకాణాల్లో తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

ఎరువుల దుకాణాల్లో తనిఖీలు

May 31 2025 1:12 AM | Updated on May 31 2025 4:53 PM

కర్నూలు(అగ్రికల్చర్‌): నగరంలోని రసాయన ఎరువుల దుకాణాలను వ్యవసాయ అధికారులు శుక్రవారం తనిఖీ చేశారు. శివరామకృష్ణ ఫర్టిలైజర్‌లో ఈ–పాస్‌ మిషన్‌లో కనిపించే స్టాకుకు, మాన్యువల్‌గా ఉన్న స్టాకులో భారీగా తేడాలను గుర్తించారు. రూ.96.95 విలువ చేసే బయో ఉత్పత్తులు, రసాయన ఎరువుల అమ్మకాలను నిలిపి వేశారు. కొత్తబస్టాండు దగ్గర ఉన్న అంబికా ట్రేడర్స్‌లో పురుగు మందుల వివరాలు, స్టాకు రికార్డులను పరిశీలించా రు. వివిధ బయో ఉత్పత్తులకు ఓఫామ్‌ వివరాలు లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. దీంతో రూ.27 లక్షల విలువ చేసే రూ.2443 లీటర్ల పురుగు మందులు, బయో ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేశారు. ఈ సందర్బంగా జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి మాట్లాడుతూ... పురుగుమందులు ,పర్టిలైజర్స్‌ దుకాణాలను 100 శాతం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలన్నారు. రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు.

రైల్వే ట్రాక్‌పై జారి పడి వ్యక్తి మృతి

సంజామల: సంజామల – కొలిమిగుండ్ల మధ్య ఉన్న రాంకో సిమెంట్‌ ఫ్యాక్టరీ సంబంధించిన రెల్వే ట్రాక్‌పై ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ జారిపడి మృతి చెందాడు. ఎస్‌ఐ రమణయ్య తెలిపిన వివరాల మేరకు.. తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్‌ కుర్వి మండలానికి చెందిన దుస్సా రాంబాబు (40) మతిస్థిమితం లేక 20 రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చి సంజామల రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. గురువారం సంజామల–కొలిమిగుండ్ల సిమెంట్‌ ఫ్యాక్టరీ రైల్వేలైన్‌ వెంట నడిచి వెళ్తూ సంజామల సమీపంలో ప్రమాదవశాత్తు జారి కింద పడిపోయాడు. 

తీవ్ర గాయాలు కావడతో స్థానికులు గుర్తించి 108లో కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. మృతుని వద్ద లభించిన ఆధారాలతో పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో నంద్యాల చేరుకుని మృతదేహాన్ని సొంతూరుకు తీసుకెళ్లారు. మృతినికి భార్య విజయ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతిని సోదరుడు వీరభద్రం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement