
జీడీపీ గేట్ల మరమ్మతుల పరిశీలన
గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్టు (జీడీపీ) గేట్ల మరమ్మతులను శుక్రవారం నీటిపారుదల శాఖ ఈఈ పాండు రంగయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులో ప్రస్తుతం 1.1 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. బండగట్టు, పత్తికొండ, కృష్ణగిరి, డోన్ పట్టణాలకు తాగునీటి కోసం జీడీపీ నుంచి వదులుతున్నట్లు తెలిపారు. గేట్ల మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించామన్నారు. కార్యక్రమంలో డీఈ విజయకుమార్, వర్క్ ఇన్స్పెక్టర్ ఉగ్ర నరసింహ, సిబ్బంది పాల్గొన్నారు.
చనుగొండ్ల సమీపాన
దారి దోపిడీ
కోడుమూరు రూరల్: గూడూరు నుంచి కోడుమూరుకు వచ్చే రోడ్డులో చనుగొండ్ల సమీపాన దారి దోపిడీ జరిగింది. బైక్పై వస్తున్న గూడూరుకు చెందిన మున్న అనే వ్యక్తిపై కొందరు గుర్తుతెలియని దుండగులు దాడి చేసి డబ్బులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. గూడూరుకు చెందిన మున్న భార్య ఊరైన గోనెగండ్లలో కూలిపనులు చేసుకుంటూ గూడూరుకు అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడు. గురువారం రాత్రి గూడూరుకు వచ్చి గోనెగండ్లకు బైక్పై వెళుతుండగా చనుగొండ్ల దాటిన తర్వాత ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఆపారు. అనంతరం మున్నను తీవ్రంగా కొట్టుకుంటూ పక్కనున్న ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి కత్తులతో బెదిరించి జేబులో ఉన్న రూ.5వేల నగదును లాక్కున్నారు. అనంతరం అటుగా వాహనాలు రావడం, బాధితుడు అరవడంతో దుండగులు మున్నను వదిలేసి పారిపోయారు. బాధితుడి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గూడూరు పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
డీసీఎంఎస్ చైర్మన్గా నాగేశ్వరరావు యాదవ్
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్) నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్చార్జి చైర్మన్గా టీడీ పీ నేత వై.నాగేశ్వరరావు యాదవ్ను నియమి స్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన స్వస్థలం డోన్ నియోజక వర్గం ప్యాపిలి మండలం చండ్రపల్లి గ్రామం. ఇదిలాఉంటే ఏడుగురితో నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్చార్జి కమిటీ ఏర్పాటు కావాల్సి ఉండగా.. ప్రస్తుతానికి చైర్మన్ ఒక్కరినే నియమిస్తూ జీవో జారీ కావడం గమనార్హం. అదేవిధంగా పీఏసీఎస్లకు ఎన్నికలు నిర్వహించకుండా కూటమి ప్రభుత్వం దొడ్డిదారిన టీడీపీ నేతలకు పదవులు కట్టబెడుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.