
పెద్దాసుపత్రిలో ఊడిన పెచ్చులు
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని పరిపాలనా భవనంలో ఉన్న ధన్వంతరి సమావేశ మందిరంలో పెచ్చులూడి పడ్డాయి. శుక్రవారం సాయంత్రం ఈ మందిరంలో రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సమీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే మధ్యాహ్నం తర్వాత ధన్వంతరి హాలులో ఉన్న ఫలంగా పెచ్చులూడి పడటంతో మందిరంలో ఓ మూలన పైకప్పు కింద పడిపోయింది. దీంతో మంత్రి సమీక్షను ప్రభుత్వ అతిథిగృహానికి మార్చారు. పెచ్చులూడిన సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. – కర్నూలు(హాస్పిటల్)
ధన్వంతరి హాలులో పెచ్చులూడిన ప్రాంతం