అనుమానమే పెనుభూతమై.. | - | Sakshi
Sakshi News home page

అనుమానమే పెనుభూతమై..

May 31 2025 1:12 AM | Updated on May 31 2025 4:30 PM

భార్యపై కొడవలితో దాడిచేసిన భర్త

పెద్దకడబూరు: భార్యపై అనుమానంతో ఎరుకలి కొడవలితో భర్త దాడి చేశాడు. బార్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన కంబదహాల్‌ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. కంబదహాల్‌ గ్రామానికి చెందిన జయమ్మ కూతురు జయంతిని ఆలూరు మండలం అంగస్కల్‌ గ్రామానికి చెందిన వేమారెడ్డి అలియాస్‌ మద్దికెర నేమిరెడ్డికి ఇచ్చి 16 సంవత్సరాల క్రితం పెళ్లి చేశారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 

మనస్పర్ధలు రావడంతో మూడు సంవత్సరాల క్రితం కుమారులను భర్త దగ్గరే వదిలి జయమ్మ పుట్టినిల్లు అయిన కంబదహాల్‌ గ్రామానికి వెళ్లారు. తల్లి జయమ్మతో కలసి ఉంటున్నారు. విడాకుల కోసం ఆదోని కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంటదని భర్త భావించి చంపేస్తానంటూ ఫోన్‌ చేసి బెదిరించేవాడు. 

శుక్రవారం కంబదహాల్‌కు వచ్చి భార్య పైన, అత్తపైన తన వెంట తెచ్చుకున్న ఎరుకలి కొడవలితో దాడి చేశాడు. దాడిలో తల్లి, కూతుళ్లుకు ఇద్దరికి రక్తగాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూల్‌కు తరలించారు. బాధితురాలు జయంతి ఫ్యిరాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement