ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తాం | - | Sakshi
Sakshi News home page

ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తాం

May 7 2025 12:54 AM | Updated on May 7 2025 12:54 AM

ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తాం

ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తాం

● జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి

కర్నూలు (అర్బన్‌): 70 ఏళ్ల వయస్సు పైబడిన ఖైదీలకు, అనారోగ్యంతో బాధ పడేవారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తామని, అలాగే బెయిల్‌ త్వరగా మంజూరయ్యేలా కృషి చేస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక పురుషుల కేంద్ర కారాగారం, మహిళల కారాగారాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన జైలు ప్రిజన్‌ లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్లినిక్‌లో ఒక న్యాయవాది, ఒక పారా లీగల్‌ వాలంటీర్‌ ఉంటారని, వారు ఖైదీలకు న్యాయ సహాయం అందిస్తారన్నారు. జైలులో ఉన్న ఖైదీలు సత్ప్రవర్తనతో శిక్షను పూర్తి చేసుకోవాలని కోరారు. ఎవరికై నా న్యాయవాదులు లేకుంటే ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామన్నారు. ఖైదీలకు అందించే ఆహారాన్ని, రేషన్‌తో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని, తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. ఖైదీలను కోర్టు వాయిదాలకు కచ్చితంగా హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కర్నూలు వారిని సంప్రదించాలన్నారు. లీగల్‌ సర్వీసెస్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 15100పై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో జైలు అధికారులు, న్యాయవాది శివరాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement