
అంటు వ్యాధుల విభాగం ఏర్పాటు
కర్నూలు(హాస్పిటల్): రాష్ట్ర వ్యాప్తంగా డయేరియా(అతిసార) కేసులు ప్రబలుతున్న తరుణంలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అంటువ్యాధుల విభాగాన్ని ఆసుపత్రి అధికారులు ఏర్పాటు చేశారు. గతంలో ఈ విభాగం మానసిక వ్యాధుల విభాగం ఎదురుగా ఉండేది. కోవిడ్–19 సమయంలో ఆ విభాగాన్ని వీఐపీలకు చికిత్సనందించేందుకు అనువుగా మరమ్మతులు చేశారు. మూడేళ్లుగా దానిని వాడకపోవడంతో అది మరుగునపడిపోయింది. ఇటీవల ఖాళీ అయిన సెంట్రల్ల్యాబ్ భవనంలో అంటువ్యాధుల విభాగాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ఇందుకు అవసరమైన పడకలను, వైద్యులు, నర్సులు, సిబ్బందిని కేటాయించారు. ప్రస్తుతం అడ్మిషన్కు అవసరమైన కేసులు రాకపోయినా భవిష్యత్లో ఒకేసారి వస్తే చికిత్స అందించేందుకు అనువుగా ఏర్పాట్లు చేశారు.