రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం

Jan 19 2024 1:16 AM | Updated on Jan 19 2024 12:58 PM

- - Sakshi

శ్రీశైలం: శ్రీశైలానికి చెందిన ఓ యువతి గురువారం హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. శ్రీశైల దేవస్థానంలో ప్రొటోకాల్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్న మల్లికార్జున సోదరి సునీత(26) ప్రస్తుతం హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ కూకటిపల్లి హౌసింగ్‌బోర్డులో నివాసముంటోంది.

గురువారం స్కూటీపై విధులకు వెళ్తుండగా మార్గమధ్యలో వెనుక నుంచి వాటర్‌ ట్యాంక్‌ ఢీకొనడంతో అదుపు తప్పి కింద పడింది. పక్కనే వస్తున్న ఆర్టీసీ బస్సు టైర్లు ఎక్కడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు వివరాలు సేకరించి మృతురాలి కుటుంబీకులకు సమాచారం అందించంతో వారు శ్రీశైలం నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement