మధురానగర్(విజయవాడసెంట్రల్): మాచవరం శ్రీదాసాంజనేయస్వామి దేవాలయంలో శ్రీరామ నవమి కల్యాణ మహోత్సవానికి రామవరప్పాడుకు చెందిన దాత ప్రయాగ సీతారామశాస్త్రి అరకిలో వెండి రజత కిరీటాన్ని ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ కృష్ణప్రసాద్కు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా దాత ప్రయాగ సీతారామశాస్త్రి మాట్లాడుతూ కల్యాణోత్సంలో తాను భాగస్వామి కావడం ఆనందంగా ఉందన్నారు. ఆలయ ధర్మ కర్తల మండలి చైర్మన్ కృష్ణప్రసాద్ ఆలయ అభి వృద్ధికి దాతల సహకారం మరువలేనిదన్నారు. అనంతరం అర్చకుడు సుబ్బయ్య ప్రత్యేక పూజలు చేసి దాతను స్వామివారి శేషవస్త్రం, చిత్రపటంతో సత్కరించారు. కార్యక్రమంలో ఈఓ పాతూరి లోకేశ్వరి తదితరులు పాల్గొన్నారు.


