గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

May 2 2025 1:53 AM | Updated on May 2 2025 1:00 PM

పెనమలూరు: పెనమలూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కుటుంబ తగాదాలతో గడ్డి మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం పెనమలూరు చెరువు కట్టకు చెందిన ఉప్పలపు రమేష్‌ (53) స్వగ్రామం మొవ్వ మండలం కాజ గ్రామం. అతను 30 సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులతో వచ్చి పెనమలూరు గ్రామంలో స్థిరపడ్డాడు. 

కానూరులో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రమేష్‌కు భార్య ఇద్దకు కుమార్తెలు. కుమార్తెలకు వివాహం చేశాడు. కొంతకాలంగా రమేష్‌కు భార్యతో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అతను బుధవారం పెనమలూరు–వణుకూరు రోడ్డులో గడ్డి మందు తాగి ఇంటికి వచ్చి చెప్పగా అతనిని వెంటనే కానూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న రమేష్‌ గురువారం మృతి చెందాడు. ఈ ఘటనపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆసియా రోలర్‌ స్కేటింగ్‌ చాంపియన్‌షిప్‌కు కైవల్య, చైత్రదీపిక

విజయవాడస్పోర్ట్స్‌: దక్షిణ కొరియాలో జరిగే ఆసియా రోలర్‌ స్కేటింగ్‌ చాంపియన్‌షిప్‌కు ప్రాతినిధ్యం వహించే భారత జట్టులో విజయవాడకు చెందిన కొప్పవరపు కై వల్య, పి.చైత్రదీపిక చోటు దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన భారత జట్టు ఎంపిక పోటీల్లో వీరిరువురూ అత్యుత్తమ ప్రదర్శనతో ఆసియా చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించారు. యూత్‌ బాలుర సోలో ఫ్రీ స్టయిల్‌ వ్యక్తిగత విభాగానికి కైవల్య ఎంపిక కాగా, యూత్‌ పెయిర్‌ స్కేటింగ్‌ విభాగానికి కై వల్య, చైత్రదీపిక ఎంపికయ్యారు. వీరిద్దరూ ఇటీవల తైవాన్‌లో జరిగిన తైవాన్‌ స్కేటింగ్‌ ప్రపంచ కప్‌ పలు విభాగాల పోటీల్లో సత్తా చాటి దేశానికి పతకాలు అందించారు. వీరు ప్రస్తుతం పటమటలోని ఎన్‌ఎస్‌ఎం స్కూల్‌లో చదువుతున్నారు. ప్రతిష్టాత్మకమైన పోటీలకు ఎంపికై న వీరిద్దరినీ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ రాయప్పరెడ్డి అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement