కెరమెరి: పంచాయతీల్లో ఈ నెల 31లోగా పన్నులు వసూలు చేయాలని డీఎల్పీవో ఉమర్ హుస్సేన్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం పంచాయతీ కార్యదర్శులతో సమవేశమయ్యారు. వసూలుకు మరో నాలుగు రోజుల గడువు మాత్రమే ఉండగా, ఇప్పటివరకు 87 శాతం పూర్తయినట్లు తెలిపారు. బకాయిలపై దృష్టి సారించి లక్ష్యం చేరుకోవాలని ఆదేశించారు. వేసవి నేపథ్యంలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని, చేతిపంపులకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఇన్చార్జి ఎంపీడీవో సాయిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


