
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
ఆసిఫాబాద్: ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెండో సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు– 2025, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ అందించారు. జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికల్లో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమన్నారు. షెడ్యూల్ విడుదలైనందున అధికారులు ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి విధులు నిర్వహించాలన్నారు. హ్యాండ్ బుక్ను క్షుణ్ణంగా చదివి ప్రతీ అంశంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూసుకోవాలన్నారు. సందేహాలు, అపోహలు నివృత్తి చేసుకోవాలన్నారు. సమావేశంలో కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డీపీవో భిక్షపతి గౌడ్, డీఎల్పీవో ఉమర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.