
నామినేషన్ పద్ధతిలో బొగ్గుబ్లాకులు అప్పగించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): రాష్ట్రంలోని బొగ్గు బ్లా కులను నామినేషన్ పద్ధతిలో సింగరేణి సంస్థకే కేటాయించాలని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు. టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ పిలుపు మేరకు శుక్రవారం గోలేటి టౌన్షిప్లోని జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జీఎం విజయ భాస్కర్రెడ్డికి వినతిపత్రం అందించారు. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగులకు మెరుగైన వైద్య సౌకర్యం కల్పించేందుకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చే యాలని, మెడికల్ కార్డులు అందించాలన్నా రు. కార్మిక కాలనీలకు రక్షిత మంచినీటి సరాఫరా చేయడంతోపాటు మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అన్నారు. గోలేటి ఓసీపీని త్వరగా ప్రారంభించాలని డిమాండ్ చేశారు. నాయకులు మంగీలాల్, వెంకటేశం, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, రమేశ్, సమ్మయ్య, ఓదెలు పాల్గొన్నారు.