నోరూరేలా.. సంక్రాంతి రుచులు
మైసూరు: నగరంలోని రామకృష్ణ నగరలోని వాసు లేఔట్లో బడగనాథ భవన్ లో సంక్రాంతి ఆహార మేళా ప్రజలను ఆకర్షిస్తోంది. డజన్ల కొద్దీ తీయని, కారం వంటకాలు ఆహారప్రియులను అలరిస్తున్నాయి. అలాగే వివిధ రకాల దుస్తులు, ఆభరణాలు, కళాకారులు రూపొందించిన చిత్రాల ప్రదర్శన కూడా ఏర్పాటైంది.
సందర్శకులకు నోరూరగా వంటకాలను రుచి చూశారు. బాదం పాలు, కొబ్బరి పాలు, చెరకు పాలు, వీటితో పాటు రాగి, జొన్న పాలు విక్రయించారు. రాగి లేదా జొన్నలను కనీసం 3 గంటలు నీటిలో నానబెట్టి, కొబ్బరి, యాలకులు, బెల్లంతో కలిపి మెత్తగా రుబ్బితే జొన్న పాలు ఉత్పత్తి అవుతాయి. ఇది రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మహిళలు తాము తయారుచేసిన చిరుతిళ్లను స్టాళ్లలో విక్రయించారు. బడగనాథ్ బలగ అధ్యక్షుడు ప్రభాకర్, నిర్వాహకులు పాల్గొన్నారు.
నోరూరేలా.. సంక్రాంతి రుచులు


