మహిళా ఉద్యోగులకు శుభవార్త | - | Sakshi
Sakshi News home page

మహిళా ఉద్యోగులకు శుభవార్త

Oct 10 2025 6:12 AM | Updated on Oct 10 2025 6:12 AM

మహిళా ఉద్యోగులకు శుభవార్త

మహిళా ఉద్యోగులకు శుభవార్త

శివాజీనగర: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేసే యువతులు, మహిళలకు ప్రతి నెలా ఒకరోజు జీతంతో కూడిన సెలవు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రుతుస్రావ సమయంలో ఈ సెలవును ఉపయోగించుకోవచ్చు. గురువారం ఈ మేరకు సీఎం సిద్దరామయ్య, మంత్రుల సమావేశంలో ఆమోదం తెలిపారు. ఇతరత్రా ముఖ్య నిర్ణయాలను మంత్రి హెచ్‌.కే.పాటిల్‌ తెలిపారు.

కనకపురలో మెడికల్‌ కాలేజీ

● వైద్యవిద్యా శాఖ ద్వారా కనకపురలో కొత్త మెడికల్‌ కాలేజీ స్థాపన. రూ.550 కోట్లతో 300 పడకల బోధనా ఆసుపత్రి, హాస్టళ్ల నిర్మాణం.

● రాష్ట్రంలో కట్టడ కార్మికుల పిల్లలకు 11 హాస్టళ్లు

● రాష్ట్ర సివిల్‌ సేవల ఉద్యోగాల నియామకాలకు వయో పరిమితి 3 సంవత్సరాలు పెంపు. దీంతో నిరుద్యోగులకు ఊరట లభిస్తుంది

● బెంగళూరు ఉత్తర తాలూకా మాచోహళ్ళిలో 78 ఎకరాల అటవీ భూమిని వివిధ సంస్థలకు కేటాయించడాన్ని రద్దు చేశారు

● పోలీసుశాఖకు రూ.89.22 కోట్లతో పరికరాల కొనుగోలు, శిక్షణ వసతులు

● రూ.200 కోట్లతో వంతెనలకు మరమ్మతులు. అలాగే రూ.1000 కోట్లతో 39 వంతెనల నిర్మాణానికి అనుమతి.

నెలలో ఓరోజు వేతన సెలవు

కేబినెట్‌ భేటీలో ఆమోదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement