
దుష్ట శిక్షణలో రాజీ లేదు
శివాజీనగర: శిష్ట రక్షణ, దుష్టుల సంహారంలో భారతదేశం ఏనాడూ రాజీ పడలేదు, మునుముందు కూడా జరగదని సీఎం సిద్దరామయ్య తెలిపారు. బెంగళూరు టౌన్హాల్లో జై హింద్ పేరిట కాంగ్రెస్ పార్టీ దేశభక్తి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో రిటైర్డు సైనిక సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాకు వందనం చేశారు. సీఎం మాట్లాడుతూ భారతీయ సైనికుల శక్తిని కొనియాడారు. దుష్టుల సహారానికి ప్రతి ఒక భారతీయుల కట్టుబడి ఉన్నారని అన్నారు. సైనికులు, రైతులు, వైద్యులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చిరస్మరణీయులని తెలిపారు. రిటైర్డ్ సైనికుల సంక్షేమం కోసం పలు చర్యలు చేపట్టామని తెలిపారు.