జనౌషధి కేంద్రాలను పునఃప్రారంభించాలి | - | Sakshi
Sakshi News home page

జనౌషధి కేంద్రాలను పునఃప్రారంభించాలి

May 31 2025 2:04 AM | Updated on May 31 2025 2:04 AM

జనౌషధి కేంద్రాలను పునఃప్రారంభించాలి

జనౌషధి కేంద్రాలను పునఃప్రారంభించాలి

బళ్లారి రూరల్‌ : ప్రభుత్వ ఆస్పత్రుల ఆవరనలో జనౌషధి కేంద్రాలను మూసివేయాలని రాష్ట్రప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం బీఎంసీఆర్‌సీ ఆసుపత్రి ముందు బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జనౌషధి కేంద్రాలను పునః ప్రారంభించాలన్నారు. కేవలం ప్రధాని మోదీ బొమ్మ ఉన్నందునే అధికార రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొందని ఆరోపించారు. అధిక మొత్తం చెల్లించి మందులు కొనలేని పేదలకు జనౌషధి కేంద్రాలు ఎంతో సహాయకారిగా ఉండేవన్నారు. జనౌషధి కేంద్రాలను మూసివేస్తే, మందులు కొనలేని పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. డ్రగ్‌ మాషియాలో భాగంగానే తక్కువ ధరకు మందులను అందించే జనౌషధి కేంద్రాలను మూసివేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపారు. బీఎంసీఆర్‌సీ ఆసుపత్రిలో కుక్కకాటుకు వినియోగించే రేబిస్‌ మందుల కొరత ఉందన్నారు. అందువల్ల వైద్యులు బయట మందులషాపులకు చీటీలు రాసిస్తున్నారన్నారు. అందోళనలో భాగంగా బీజేపీ నాయకులు నినాదాలతో కూడిన ప్లకార్డులతో ఆసుపత్రి ముందు బైటాయించారు.

రాష్ట్రప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ శ్రేణుల ఆందోళన

బీఎంసీఆర్‌సీ ఆసుపత్రి ముందు బైటాయించి ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement