శ్మశాన వాటికకు దారేదీ? | - | Sakshi
Sakshi News home page

శ్మశాన వాటికకు దారేదీ?

Jun 3 2025 12:22 AM | Updated on Jun 3 2025 12:22 AM

శ్మశాన వాటికకు దారేదీ?

శ్మశాన వాటికకు దారేదీ?

హొసపేటె: శ్మశాన వాటికకు వెళ్లే దారిలో తీగ కంచె ఏర్పాటుతో అంత్యక్రియలకు ఆటంకం కలిగిన ఘటన మరియమ్మనహళ్లిలో జరిగింది. శ్మశాన వాటికకు వెళ్లే దారి మూసుకొని పోవడంతో ఖననం చేయడానికి దారి లేకుండా పోయింది. దీంతో దాణాపుర గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటాపుర హంపినకట్టె గ్రామంలో ముస్లింలు ఆందోళనలో ఉన్నారు. గ్రామంలోని ముస్లింలు ఎవరైనా మరణిస్తే అదే శ్మశాన వాటికలో ఖననం చేస్తారు. ఆ గ్రామానికి చెందిన హొన్నూరు సాబ్‌ అనే వ్యక్తి శనివారం మరణించగా, అంత్యక్రియల కోసం శ్మశాన వాటికకు మృతదేహాన్ని తరలించారు. దాదాపు ఏడాది కాలంగా ఉన్న ఆ రోడ్డుపై ఒక ప్రైవేటు వ్యక్తి ఇనుప కంచె వేసి దారి లేకుండా చేశాడు. మృతదేహాన్ని మోసుకెళ్తున్న మృతుడి బంధువులు తమకు దారి తెలియక కొంతసేపు ఇబ్బంది పడ్డారు. శ్మశాన వాటిక దగ్గర భూమిని కొన్న ఒక వ్యక్తి వందలాది ఏళ్లుగా ఉన్న శ్మశాన వాటికకు దారిని వదలడానికి బదులుగా తీగతో కంచెను ఏర్పాటు చేశాడు. ఏళ్ల తరబడి అక్కడ ఉన్న శ్మశానవాటికకు వెళ్లే రోడ్డు పక్కన ఒక ప్రైవేటు వ్యక్తి అకస్మాత్తుగా ముళ్ల కంచెను నిర్మించాడు. దీంతో మృతదేహాన్ని పొరుగున ఉన్న పొలం గుండా తీసుకెళ్లి శ్మశాన వాటికలో దహనం చేయాల్సి వచ్చింది.

ఇనుప కంచె వేయడంతో

రాకపోకలకు ఆటంకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement