
తండ్రీకుమార్తెకు గాయాలు
● బైక్ను ఢీకొన్న టిప్పర్ లారీ
శివమొగ్గ: టిప్పర్ లారీ ఢీకొని తండ్రీ కుమార్తె గాయపడ్డారు. ఈ ఘటన శివమొగ్గ శివార్లలోని శివరామపుర సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. కుమార్తెను స్కూల్లో దింపడానికి బైక్లో తీసుకు వెళ్తుండగా అరనూరు నుంచి శివమొగ్గ వైపు వస్తున్న టిప్పర్ వేగంగా వచ్చి ఢీకొంది. తండ్రీ కుమార్తె గాయపడగా ఆస్పత్రికి తరలించారు. వారు స్పృహలో లేనందున ఏ గ్రామానికి చెందిన వారనేది తెలియరాలేదు. తుంగా నగర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.