ప్రతి మదిలో విజయానందం | - | Sakshi
Sakshi News home page

ప్రతి మదిలో విజయానందం

Jun 5 2025 7:48 AM | Updated on Jun 5 2025 7:48 AM

ప్రతి

ప్రతి మదిలో విజయానందం

బనశంకరి: ఎన్నో ఏళ్లుగా ఊరిస్తూ వచ్చిన విజయం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు( ఆర్‌సీబీ) సొంతమైంది. ఆ జట్టు ఐపీఎల్‌–20 విజేతగా నిలవడంతో కర్ణాటకలో విజయోత్సవాలు మిన్నంటాయి. క్రికెట్‌ అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. మంగళవారం జరిగిన ఫైనల్‌ పోటీల సందర్భంగా మ్యాచ్‌ ముగిసే వరకు అభిమానులు ఎంతో ఉత్కంఠతో గడిపారు. ఆర్‌సీబీ విజయం సాధించాలని అభిమానులు పలుచోట్ల ఆలయాల్లో పూజలు నిర్వహించారు. ఆర్‌సీబీ, పంజాబ్‌ కింగ్స్‌ మధ్య ఉత్కంఠగా జరిగిన పోటీలను కోట్లాది మంది అభిమానులు టీవీలకు అతుక్కుపోయి వీక్షించారు. నగరంలో పలు ప్రాంతాల్లో భారీ డిజిటల్‌ తెరలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ పోటీలను వీక్షించే ఏర్పాట్లు చేయగా నగరవాసులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఎట్టకేలకు ఆర్‌సీబీ విజయం సాధించడంతో ఒక్కసారిగా అభిమానుల్లో ఉత్సాహం పెల్లుబుకింది. నగరవాసులు ఇళ్ల నుంచి రోడ్లపైకి వచ్చి నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు. బాణా సంచా పేల్చి స్వీట్లు పంచారు. కేకలు వేసి కేరింతలు కొట్టారు. యువత బైక్‌ల్లో సంచరిస్తూ హోరెత్తించారు. విరాట్‌కోహ్లి అభిమానులు కోహ్లి ఫొటోలతో కూడిన టీషర్ట్స్‌ ధరించి సందడిచేశారు. బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో యువత, క్రికెట్‌ ప్రేమికులు సంబరాలు చేసుకున్నారు. యువత మొత్తం రోడ్లపైకి రావడంతో బెంగళూరు నగరంలో చాలారోడ్లులో ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. ఆనేకల్‌, మారతహళ్లితో పాటు అనేక ప్రాంతాల్లో సంబరాలు మిన్నంటాయి. యువకులు రోడ్లుపై సందడి చేస్తుండగా వీరిని నియంత్రించడానికి పోలీసులు నానాతంటాలు పడ్డారు.

విజయోత్సవ యాత్ర ఉరేగింపులేదు....

భద్రతాదృష్ట్యా ఆర్‌సీబీ ఆటగాళ్లు విజయోత్సవ యాత్ర ఉరేగింపు లేదని విధానసౌధ ముందుబాగంలో ప్రభుత్వ ఆద్వర్యంలో సన్మానం, చిన్నస్వామిస్టేడియంలో సంబరాలు ఉంటాయని హోంశాఖమంత్రి డాక్టర్‌జీ పరమేశ్వర్‌ తెలిపారు. విధానసౌధ తూర్పుద్వారం గ్రాండ్‌స్టెప్స్‌పై జరిగే సన్మాన కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం పరమేశ్వర్‌ మాట్లాడారు. భద్రతా దృష్టితో ఆర్‌సీబీ జట్టు ఉరేగింపు ఉండదని క్రికెటర్లు అందరూ బస్సులో విధానసౌధకు వస్తారని, అక్కడ ప్రభుత్వ సన్మానం స్వీకరించిన తరువాత బస్సులో చిన్నస్వామి స్టేడియం చేరుకుంటారని తెలిపారు. చిన్నస్వామిస్టేడియంలో పోలీసులు పటిష్టభద్రతా ఏర్పాట్లు చేశారు.ట్రాఫిక్‌ రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకున్నారని తెలిపారు.

ఐపీఎల్‌ పోటీల్లో ఆర్‌సీబీ జట్టు విజయంపై హోరెత్తిన సంబరాలు

రోడ్లపై నృత్యాలు చేస్తూ కేరింతలు

కొట్టిన అభిమానులు

జనసంద్రంగా మారిన విధానసౌధ

పరిసరాలు

ప్రతి మదిలో విజయానందం1
1/2

ప్రతి మదిలో విజయానందం

ప్రతి మదిలో విజయానందం2
2/2

ప్రతి మదిలో విజయానందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement