
నింగినంటేలా గెలుపు సంబరం
సాక్షి, బెంగళూరు: ఐపీఎల్ టోర్నీ విజేతగా నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టీం బుధవారం బెంగళూరులో విజయయాత్ర నిర్వహించింది. విరాట్ కోహ్లీ సహా జట్టు సభ్యులు మధ్యాహ్నం బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వారికి స్వాగతం పలికారు. అక్కడి నుంచి తాజ్ హోటల్కు వచ్చి విడిది చేశారు.
జనసంద్రం మధ్య వేడుక
● విధానసౌధ మెట్లపై బృహత్ సన్మానోత్సవం జరిగింది. గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు ఆర్సీబీ జట్టు కోహ్లీ, రజత్ పాటిదార్ సహా ఆటగాళ్లను మైసూరు పేటా పెట్టి, శాలువ, పూలదండలతో ఘనంగా సత్కరించారు.
● టీం సభ్యులు గర్వంగా ఐపీఎల్ ట్రోఫీని ప్రదర్శించారు. వేలాదిమంది అభిమానులు కేరింతలతో హర్షధ్వానాలు చేశారు.
● సౌధ చుట్టుపక్కల ఎక్కడ చూసినా అభిమానులే కనిపించారు. వాహనాలు, గోడలు, భవనాలు, ఎత్తైన చెట్లను ఎక్కి వీక్షించారు.
● ఎక్కువగా టీనేజర్లు, యువత వెల్లువలా వచ్చారు. ఆర్సీబీ.. ఆర్సీబీ...కోహ్లీ కోహ్లీ అంటూ నినాదాలతో మారుమోగింది.
● అయితే అంతలోనే వర్షం రావడంతో హడావుడిగా ఈ కార్యక్రమాన్ని ముగించి ఆటగాళ్లను బస్సులోకి పంపించారు.
● మరోవైపు రాష్ట్రమంతటా అభిమానులు సంబరాలలో మునిగి తేలారు. టపాసులు మోతమోగాయి. బెంగళూరు న్యూ ఇయర్ సంబరాలను తలపించింది.
కోహ్లీ సేనకు విధానసౌధ ముందు
ఘన సన్మానం
వెల్లువలా వచ్చిన అభిమానులు,
నగరవాసులు

నింగినంటేలా గెలుపు సంబరం

నింగినంటేలా గెలుపు సంబరం

నింగినంటేలా గెలుపు సంబరం

నింగినంటేలా గెలుపు సంబరం

నింగినంటేలా గెలుపు సంబరం