ఠాణా వద్దే భార్య నరికివేత | - | Sakshi
Sakshi News home page

ఠాణా వద్దే భార్య నరికివేత

Jun 8 2025 12:56 AM | Updated on Jun 8 2025 12:56 AM

ఠాణా వద్దే భార్య నరికివేత

ఠాణా వద్దే భార్య నరికివేత

మైసూరు: చామరాజనగర పట్టణ పోలీసు స్టేషన్‌ వద్ద భార్యను కొడవలితో నరికి చంపిన కిరాతక భర్త గి రీష్‌ను పట్టణ స్టేషన్‌ పోలీసులు శుక్రవారం బంధించారు. సోమవారపేటె స్టేషన్‌ మఠం వద్ద ఉండగా పట్టుకుని జిల్లాస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. తరువాత హత్యాస్థలానికి తీసుకెళ్లి స్థల మహజరు జరిపారు. కేసు గురించి అతని నుంచి సమాచారం సేకరించి జిల్లా జైలుకు తరలించారు.

ఆమెకు భద్రత కల్పించి ఉంటే

పట్టణ పోలీసు స్టేషన్‌ సమీపంలో గిరీష్‌ తన భార్య విద్య ను బుధవారం మధ్యాహ్నం ఇష్టానుసారంగా వేటకొడవలితో నరికి చంపి పరారు కావడం తెలిసిందే. ఠాణా దగ్గరే మహిళ హత్యకు గురికావడంపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అతని వేధింపులను తట్టుకోలేక ఆమె కోయంబత్తూరులో తలదాచుకుంది. గిరీష్‌ ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలించి తీసుకొచ్చారు. మళ్లీ సతాయించడంతో బాధితురాలు పోలీసులకు మొరపెట్టుకోగా ఆమెను ఆశ్రయ కేంద్రంలో ఉంచారు. అక్కడకు కూడా వెళ్లి సైకో భర్త గొడవపడేవాడు, ఆమె ఫోన్‌ని కూడా లాక్కున్నాడు. దీంతో ఆ రోజు ఠాణాలో ఫిర్యాదు చేసి ఆశ్రయ కేంద్రానికి ఒంటరిగా వెళ్తుండగా కిరాతకుడు నరికి పరారయ్యారు. ఆమెను ఆశ్రయ కేంద్రానికి సురక్షితంగా పంపించాల్సిన బాధ్యత పోలీసులదే. ఓ పోలీసును తోడుగా పంపాలి. కానీ పోలీసులు నిర్లక్ష్యం చేయడం వల్లే ఆమె హత్యకు గురైందని ప్రజలు ఆరోపించారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉండగా అనాథలయ్యారు.

కిరాతక భర్త అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement