
భక్తిశ్రద్ధలతో బక్రీద్ పండుగ
సాక్షి, బెంగళూరు: త్యాగ బలిదానాలకు సంకేతమైన బక్రీద్ పండుగను రాష్ట్రమంతటా ఘనంగా ఆచరించారు. బెంగళూరు, బళ్లారి, మైసూరు, కలబుర్గి, మంగళూరు సహా పల్లె పట్టణం అనే తేడా లేకుండా అంతటా ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఆచరించారు. శనివారం ఉదయం నుంచి మసీదుల్లో, ఈద్గా మైదానాలలో అశేష సంఖ్యలో సామూహికంగా ప్రార్థనలు చేశారు. ధర్మగురువులు బక్రీద్ పండుగ ఆచరణ, దయ, దానధర్మాల గురించి సందేశమించ్చారు. సమాజంలో ప్రతిఒక్కరూ సోదరభావంతో మెలగాలని పిలుపునిచ్చారు. ప్రార్థన అనంతరం ముస్లిం సోదరులంతా పరస్పరం ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ప్రార్థనల్లో చిన్నపిల్లలు కూడా పాల్గొన్నారు. మైదానాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటైంది. ఉద్రిక్తతలు నెలకొన్న మంగళూరు, ఉడుపి జిల్లాలో కూడా ప్రశాంతంగా పండుగను ఆచరించారు.
వేడుకలకు సీఎం దూరం
చిన్నస్వామి మైదానంలో తొక్కిసలాట ఘటనతో సీఎం సిద్ధరామయ్య ఈసారి బక్రీద్ వేడుకలకు హాజరుకాలేదు. సాధారణంగా ఏటా ఆయన బెంగళూరు చామరాజపేట ఈద్గా మైదానంలో జరిగే సామూహిక ప్రార్థనల్లో పాల్గొనడం పరిపాటిగా వస్తోంది. మంత్రి జమీర్ అహ్మద్ ఆహ్వానం పలికినప్పటికీ , సీఎం సమ్మతించలేదని తెలిసింది.
తుమకూరులో
తుమకూరు: ముస్లింల పవిత్ర పండుగలలో ఒకటి, అమరవీరుల త్యాగాలను స్మరించుకొనే బక్రీద్ ను నగరంతో పాటు జిల్లా అంతటా భక్తితో ఆచరించారు. ముస్లిం సోదరులు ఉదయమే నూతన వస్త్రాలను ధరించి తాలూకా కేంద్రాల్లోని ఈద్గా మైదానాల్లో ప్రార్థనలు నిర్వహించారు. తుమకూరులో కురిగల్లు రోడ్డులోని ఈద్గా గ్రౌండ్లో ప్రార్థనలు చేసి శుభాకంక్షలు తెలుపుకొన్నారు. పలు పార్టీల ప్రముఖులు చేరి శుభాకాంక్షలు తెలిపారు.
అంతటా సామూహిక ప్రార్థనలు

భక్తిశ్రద్ధలతో బక్రీద్ పండుగ

భక్తిశ్రద్ధలతో బక్రీద్ పండుగ

భక్తిశ్రద్ధలతో బక్రీద్ పండుగ

భక్తిశ్రద్ధలతో బక్రీద్ పండుగ