
క్రికెట్ సంఘం పెద్దల రాజీనామాలు
బనశంకరి: రాజధానిలో ఆర్సీబీ విజయోత్సవాలలో చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట పై సీఐడీ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. శనివారం స్టేడియంలో దుర్ఘటన జరిగిన స్థలాలను పరిశీలించారు. ఆర్సీబీ, కేఎస్సీఏ, డీఎన్ఏ కంపెనీల ప్రతినిధులను విచారణ చేపట్టారు. ఈ ఘోర దుర్ఘటనలో 11 మంది చనిపోగా, 60 మందికి పైగా గాయపడడం, దేశమంతటా విమర్శలు చెలరేగడం తెలిసిందే. సీఐడీ ఎస్పీ శుభన్వితా నేతృత్వంలో డీఎస్పీలు పురుషోత్తమ్, గౌతమ్, అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు. విచారించాల్సిన వ్యక్తుల జాబితాను రూపొందించే పనిలో ఉన్నారు. ఇప్పటికే అరైస్టెన ఆర్సీబీ ప్రాంచైజీ మార్కెటింగ్ విభాగం చీఫ్ నిఖిల్ సొసాలే, ఆ వేడుక నిర్వహణ బాధ్యత తీసుకున్న డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రతినిధులు సునీల్ మ్యాథ్యూ, కిరణ్, సుమంత్లను రిమాండ్ కు తరలించారు. బక్రీద్ సందర్భంగా శనివారం, ఆదివారం సెలవు కావడంతో సోమవారం నిందితులను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తారు.
ఆర్సీబీపై మరో ఎఫ్ఐఆర్
చిన్నస్వామి స్టేడియం దుర్ఘటనలో కబ్బన్పార్కు పోలీస్స్టేషన్లో ఆర్సీబీ, కేఎస్సీఏ, డీఎన్ఏ కంపెనీ పై మూడో ఎఫ్ఐఆర్ నమోదైంది. గాయపడిన బీకాం విద్యార్థి సీ.వేణు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. ఆర్సీబీ ఫ్రీ టికెట్ ప్రకటనను చూసి స్టేడియానికి వెళ్లానని, గేట్ నంబరు 6 వద్ద తొక్కిసలాట ఏర్పడింది. నా కుడికాలిపై బ్యారికేడ్ పడటంతో గాయపడి బౌరింగ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నానని ఫిర్యాదులో తెలిపాడు. రోలన్ గోమస్ అనే ఓ బాధితుడు శుక్రవారం సాయంత్రం కబ్బన్పార్కు ఠాణాలో ఫిర్యాదు చేయగా, పై మూడు సంస్థలపై కేసు దాఖలైంది. సోషల్ మీడియాలో ఆర్సీబీ పోస్ట్ను చూసి స్నేహితులతో సంబరాలు వీక్షించడానికి స్టేడియానికి వెళ్లాను, 7వ గేటు వద్ద తొక్కిసలాట ఏర్పడి గాయపడ్డానని రోలన్గోమస్ పేర్కొన్నాడు.
పరిహారం రూ.25 లక్షలకు పెంపు
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం గతంలో రూ.10 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించింది. శనివారం ఆ మొత్తాన్ని రూ. 25 లక్షలకు పెంచింది. విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
క్షతగాత్రులకు నోటీసులు
సీఐడీ టీం ముమ్మర విచారణ
ఆర్సీబీ మీద మరొకరు ఫిర్యాదు
మరోవైపు బెంగళూరు నగర జిల్లా కలెక్టర్ జగదీశ్ మెజస్టీరియల్ దర్యాప్తు ముమ్మరం చేశారు. గాయపడి బౌరింగ్, ఫోర్టీస్, మణిపాల్, వైదేహి ఆసుపత్రుల్లో ఎంతమంది చికిత్స పొందుతున్నారు, చికిత్స తీసుకుని ఇంటికెళ్లారు, దుర్ఘటనకు కారణాలు ఏమిటి అనేదానిపై సమాచారం సేకరించారు. 25 మందికి పైగా క్షతగాత్రులకు వాంగ్మూలం ఇవ్వలని నోటీస్ ఇచ్చారు. జూన్ 11వ తేదీన విచారణకు హాజరుకావాలని తెలిపారు. ఇప్పటివరకు 65 మంది గాయపడి చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. 5 మందికి ఇంకా చికిత్స కొనసాగుతోంది. ప్రమాదానికి కారణం ఏమిటి, సమస్య ఎలా తలెత్తింది అనే దానిపై వివరాలను సేకరిస్తారు. మెజస్టీరియల్ విచారణను 15 రోజుల్లోగా పూర్తిచేసి నివేదిక అందించాలి.
బనశంకరి: చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనకు బాధ్యత వహిస్తూ కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్సీఏ) కార్యదర్శి ఏ.శంకర్, కోశాధికారి ఈఎస్ జైరామ్ పదవులకు రాజీనామా చేశారు. ఘటనలో తమ పాత్ర పరిమితమైనప్పటికీ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు కేఎస్సీఏ అధ్యక్షుడు రఘురామ్భట్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు ఆర్సీబీ జట్టు పాలకమండలిలోని నలుగురు అధికారులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. కేఎస్సీఏ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని సీఎం సిద్దరామయ్య సూచించారు. విధానసౌధ ముందు ఆర్సీబీ జట్టుకు సన్మానోత్సవం జరిగింది. తరువాత చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, కేఎస్సీఏ సన్మానోత్సవం చేపట్టాయి. కానీ లక్షలాది మంది స్టేడియంలోకి చొరబడటంతో తొక్కిసలాటలు జరిగి ప్రాణనష్టం సంభవించింది.
కున్హా కమిటీకి ఆదేశం
తొక్కిసలాట ఘటనలో హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి మైకేల్ కున్హా కమిటీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. విచారణకు ప్రాధాన్యత ఇచ్చి నెలలోగా పూర్తి చేసి నివేదిక అందించాలని తెలిపింది. చామరాజనగర ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ సమయంలో ఆక్సిజన్ కొరతతో జరిగిన మరణాల మీద కున్హా కమిటీ విచారణ సాగిస్తోంది. దీనిని పూర్తిచేసి నివేదిక ఇవ్వడానికి ఆగస్టు చివరివరకు గడువును పొడిగించింది. దీంతో కున్హాపై రెండు బాధ్యతలు పడ్డాయి.

క్రికెట్ సంఘం పెద్దల రాజీనామాలు

క్రికెట్ సంఘం పెద్దల రాజీనామాలు

క్రికెట్ సంఘం పెద్దల రాజీనామాలు

క్రికెట్ సంఘం పెద్దల రాజీనామాలు