
దశభుజ గణపతికి విశేష పూజలు
రాయదుర్గం టౌన్: రాయదుర్గం పట్టణంలోని ఆత్మకూరు వీధిలో వెలసిన శ్రీదశభుజ మహాగణపతి ఆలయంలో ఆదివారం విశేష పూజలు జరిగాయి. ప్రతి ఆదివారం స్వామి వారికి అభి షేకం, పూజలు నిర్వహిస్తారు. ఏకదంతుని దర్శనం కోసం స్థానిక భక్తులే కాక బళ్లారి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకున్నారు.
కారు, బైక్ ఢీ.. ఇద్దరి మృతి
రాయచూరురూరల్: కారు, బైక్ ఢీకొని ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన యరగేర వద్ద అదివారం జరిగింది. కెరె బూదురు నివాసులుఉరుకుంద ఈరణ్ణ(42), లక్ష్మన్(40)లు బైక్పై రాయచూరు నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా యరగెరె వద్దకు రాగానే మంత్రాలయం నుంచి రాయచూరు వైపు వెళ్తున్న కారు ఎదురైంది. పరస్పరం రెండు వాహనాలు ఢీకొనడంతో ఈరణ్ణ, లక్ష్మణ్లు మృతి చెందారు. పోలీసులు మృతదేహాలను రాయచూరు సర్వజనాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
గ్రామాల అభివృద్ధే ధ్యేయం
హొసపేటె: గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు హరపనహళ్లి ఎమ్మెల్యే ఎంపీ లత తెలిపారు. విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా అడవిమల్లపుర గ్రామంలో సీసీ రోడ్డు పనులకు ఆదివారం ఎమ్మెల్యే భూమిపూజ చేసి మాట్లాడారు. రెండేళ్లలో రూ.500 కోట్లతో హరపనహళ్లి యోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. నరేగాలోనే రూ. 110 కోట్ల పనులు జరిగాయన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజనిప్ప మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ఎంపీ రవీంద్ర కృషి కారణంగా తాలూకాను సెక్షన్ 371 జే కిందకు తీసుకువచ్చినప్పటి నుంచి వందల కోట్ల గ్రాంట్ అందుతోందని అన్నారు. బీజేపీ కాలంలో వచ్చిన గ్రాంట్ ఎక్కడికి వెళుతుందో తనకు తెలియదని అన్నారు. పార్టీ నేతలు కుబేరప్ప మైదురు రామప్ప తదితరులు పాల్గొన్నారు.
ఎయిమ్స్ మంజూరుకు కృషి
రాయచూరురూరల్: రాయచూరులో ఎయిమ్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టేలా చూస్తామని జాతీయ స్వాభిమాని పరిషత్ అధ్యక్షుడు బసవరాజ పాటిల్ తెలిపారు. నగరంలోని మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో అందోళన చేపట్టిన సమితి అధ్యక్షుడు బసవరాజ కళసకు ఆయన మద్దతు పలికారు. అనంతరం మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించి రాయచూరుకు ఎయిమ్స్ మంజూరు చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అశోక్ కుమార్జైన్, అమరేగౌడ, సులోచన, తిమ్మా రెడ్డి, మహేంద్ర సింగ్, వీరభద్రయ్య, గురురాజ్, జగదీశ్, వెంకటేశ్, నరసయ్య, మహవీర్, రమేష్ పాల్గొన్నారు.
మున్నూరు కాపు సమాజ సేవలు ప్రశంసనీయం
రాయచూరురూరల్: జిల్లాలో మున్నూరు కాపు సమాజం చేపట్టిన సమాజ సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్ అన్నారు. మూన్నూరు కాపు సమాజం సాంస్కతిక ఉత్సవాల్లో భాగంగా వివిధ రంగాల్లో సేవలందంచిన ఆ సమాజ సేవకులను నగరంలోని వీరాంజనేయ స్వామి ఆలయంలో శనివారం సన్మానించారు. 25 ఏళ్లుగా ముంగారు ఉత్సవాలు నిర్వహిస్తుండటం అభినందనీయమన్నారు. వీరభద్ర శివాచార్యులు, అభినవ రాచోటి శివాచార్యులు, శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, మూన్నూరు కాపు సమాజం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి, నరసా రెడ్డి, శ్రీనివాస రెడ్డి, శంకర్ రెడ్డి, క్రిష్టమూర్తి పాల్గొన్నారు.

దశభుజ గణపతికి విశేష పూజలు

దశభుజ గణపతికి విశేష పూజలు

దశభుజ గణపతికి విశేష పూజలు