
సేలం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
హొసపేటె: తమిళనాడులోని సేలం జిల్లా వలపడిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విజయనగర జిల్లా వాసులు నలుగురు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
విజయనగర జిల్లా హగరిబోమ్మనహళ్లికి చెందిన పటేల్ ఎలక్ట్రికల్, జగదాంబ బట్టల దుకాణాల యజమానులు తమిళనాడులోని ఈరోడ్లో బంధువుల గృహ ప్రవేశానికి శుక్రవారం కారులో బయల్దేరారు. శనివారం సాయంత్రం వీరు ప్రయాణిస్తున్న కారు వలపడి వద్ద డివైడర్ను ఢీకొంది. ప్రమాదంలో రాణారామ్ పటేల్(52), జోగిరామ్(62), అతని భార్య తోగి దేవి(55), హోస్పేట్కు చెందిన బంధువు ఒకరు సంఘటనా స్థలంలోనే మరణించారు. రాణా పటేల్, అతని భార్య టోపి దేవితో సహా మరో ముగ్గురు ఆస్పత్రి గాయపడగా ఆస్పత్రికి తరలించారు. ఈఘటనతో పట్టణంలోని వ్యాపారులు దిగ్భ్రాంతి చెందారు.
నలుగురు విజయనగర
జిల్లావాసుల మృతి